ఆధ్యాత్మిక యాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు
📍 చెన్నై/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి, కేరళలోని కొచ్చి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు.
📌 పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన వివరాలు
ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ శ్రీ అగస్త్య మహర్షి ఆలయం, అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి ఆలయం, శ్రీ పరశురామ స్వామి ఆలయం, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు.
📌 స్వామినాథ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
ఈరోజు (గురువారం) పవన్ కళ్యాణ్ తంజావూర్ (Thanjavur) సమీపంలోని శ్రీ స్వామినాథ స్వామి ఆలయం ను దర్శించుకున్నారు.
🔹 పవన్ కళ్యాణ్కు డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఉమా దేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
🔹 ఆలయ అర్చకుడు శ్రీ కన్నన్ గురుకల్ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
🔹 పవన్ కళ్యాణ్ ధ్వజస్థంభానికి మొక్కులు చెల్లించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
🔹 అనంతరం పంచహారతులతో హారతి స్వీకరించారు.
🔹 కంద షష్టి కవచ పారాయణంలో పవన్ కళ్యాణ్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akhira Nandhan), తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి (Anand Sai) పాల్గొన్నారు.
