Breaking News

Action is required on the official who contributed to the poem in Singareni

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కు – మధుయాష్కీ గౌడ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కు: మధుయాష్కీ గౌడ్

📍 హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) మరియు బీఆర్ఎస్ (BRS) కలిసి పని చేస్తున్నాయి అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ (Madhu Yaskhi Goud) ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ విజయాన్ని సాదించాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలంటే, తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించాలని అభిప్రాయపడ్డారు.

దుండగుల దురాగతం.. రైతు శ్రమకు నిప్పులు

యువజన కాంగ్రెస్ నేతల భవిష్యత్తు కీలకం అని చెప్పిన మధుయాష్కీ, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా యువ నేతగా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని సూచించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులంతా ఏకతాటిపై నిలవాలని మధుయాష్కీ గౌడ్ హితవు పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలకు బహిర్గతం చేయాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: భట్టి విక్రమార్క మల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *