Breaking News

CM Revanth is ready to meet PM Modi

మోడీ పై యుద్ధం కోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం – రేవంత్ రెడ్డి

కులగణనపై పారదర్శకత.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

📍 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) కులగణన (Caste Census)ను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, “ప్రణాళిక ప్రకారమే కులగణనను ముందుకు తీసుకెళ్తాం” అని తెలిపారు.

“మైనార్టీల లెక్క ఎలా తీశారని కొందరు ప్రశ్నిస్తున్నారు. బీసీ-ఈ గ్రూప్ కింద మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టే లెక్క తీశాం” అని సీఎం వివరించారు. విపక్షాలది కేవలం దుష్ప్రచారమేనని పేర్కొన్నారు.

కేసీఆర్ సర్వే కాకి లెక్కలు!

కులగణనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి, “కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకిలెక్కలు చూపారు. ఇప్పుడు మా సర్వే తప్పంటున్నారు” అని విమర్శించారు. సర్వేలో పాల్గొనని కేసీఆర్‌కు తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

పార్టీలో కష్టపడినవారికే గుర్తింపు

“పార్టీలో కష్టపడిన వారికి తప్పక గుర్తింపు, అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు (Chandrababu Naidu), కేసీఆర్ ఇద్దరూ కూడా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారు” అని సీఎం గుర్తుచేశారు. “మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి” అన్న ప్రజల ఆకాంక్షలను యూత్ కాంగ్రెస్ కృషితో నిజం చేసింది అని ప్రశంసించారు.

ప్రభుత్వ పథకాల అమలు

“కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ధాన్యానికి బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేశాం” అని సీఎం తెలిపారు. “డబుల్ బెడ్రూం ఇళ్లంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనంత రుణమాఫీ మన ప్రభుత్వం చేసింది” అని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

“ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది” అని ఆరోపించిన సీఎం, “మెట్రో నిర్మాణం, మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? బిహార్, గుజరాత్‌కు నిధులు ఇస్తున్నారు, తెలంగాణకు మాత్రం అన్యాయం చేస్తున్నారు” అని ధ్వజమెత్తారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

బీజేపీపై తీవ్ర విమర్శలు

“ప్రధాని మోడీ (PM Modi) పై యుద్ధం కోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. “కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) తెలంగాణపై జరుగుతున్న అన్యాయానికి సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

📌 మున్ముందు కేంద్రంపై పోరాటాన్ని ముమ్మరం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *