Breaking News

Harish Rao PA arrested in phone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు పీఏ అరెస్ట్

||Harish Rao PA arrested in phone tapping case || – పోలీసుల విచారణ కొనసాగుతోంది

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యక్తిగత సహాయకుడు (PA) వంశీకృష్ణ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయిన నిందితులు – ప్రధాన ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములు అరెస్టయ్యారు.

2027 నాటికి హైకోర్టు కొత్త భవనాలు పూర్తి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి
  • చక్రధర్‌ను బెదిరిస్తూ, ఫోన్ కాల్స్, మెసేజుల ద్వారా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
  • కేసులో ఏ1 హరీశ్ రావు, ఏ2 రాధాకృష్ణన్ రావుగా పోలీసులు పేర్కొన్నారు.
  • సిద్ధిపేట జిల్లాలో చక్రధర్ గౌడ్ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు కలిసి రైతు గుర్తింపు కార్డుల ద్వారా ఫేక్ సిమ్ కార్డులు తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆరోగ్యశ్రీలో అవినీతి ఆరోపణలు – వంశీకృష్ణపై మరిన్ని కేసులు

  • గతంలో ఆరోగ్యశ్రీ శాఖలో పనిచేసిన వంశీకృష్ణపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
  • హరీశ్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, ఆయన పేషీలో వంశీకృష్ణ పని చేసినట్లు సమాచారం.

చక్రధర్ ఫిర్యాదుతో దర్యాప్తు – నిందితులకు రిమాండ్

  • చక్రధర్ గౌడ్ గత ఏడాది పంజాగుట్ట పోలీసులకు ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై ఫిర్యాదు చేశారు.
  • దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, ఫిబ్రవరి 28 వరకు రిమాండ్ విధించారు.

తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

ఈ కేసుతో తెలంగాణ రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. హరీష్ రావు పీఏ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాలు, అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రచ్చకెక్కే అవకాశం ఉంది. పోలీసుల దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది.

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *