మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి నారా లోకేష్ ప్రయాణం
ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్ (Prayagraj)లో మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతోంది. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రయోగరాజ్కు బయలుదేరి వెళ్లారు.
లోకేష్ షెడ్యూల్ – మహా పుణ్యస్నానం, ఆలయ దర్శనం
- ఉదయం 10:00 గంటలకు – ప్రయాగ్రాజ్లోని షాహి స్నానఘట్టానికి చేరుకుంటారు.
- ఉదయం 10:10 – మధ్యాహ్నం 12:10 వరకు – త్రివేణి సంగమంలో మహా కుంభమేళా పుణ్యస్నానం ఆచరిస్తారు.
- మధ్యాహ్నం 1:00 గంటకు – ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి ప్రయాణం అవుతారు.
- మధ్యాహ్నం 2:45 గంటలకు – వారణాసిలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు.
- సాయంత్రం 3:40 గంటలకు – వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- సాయంత్రం 4:00 గంటలకు – విశాలాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు.
- సాయంత్రం 5:25 గంటలకు – వారణాసి నుంచి విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు.
కుంభమేళా ప్రత్యేకత
ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహోత్సవంగా భావిస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం ద్వారా పాప విమోచనం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ క్రమంలో నారా లోకేష్ పుణ్యస్నానం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆలయ సందర్శనలతో భక్తి మయమైన ప్రయాణం
ఈ మహా యాత్రలో భాగంగా నారా లోకేష్ వారణాసిలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కుంభమేళా, వారణాసి ఆలయ దర్శనాలతో ఆయన ప్రయాణం భక్తి మయంగా సాగనుంది.
