Breaking News

Nara Lokesh Jagan wanted to bring special status.. What did he do in the end?

మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి నారా లోకేష్

మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి నారా లోకేష్ ప్రయాణం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్ (Prayagraj)లో మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతోంది. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రయోగరాజ్‌కు బయలుదేరి వెళ్లారు.

లోకేష్ షెడ్యూల్ – మహా పుణ్యస్నానం, ఆలయ దర్శనం

  • ఉదయం 10:00 గంటలకు – ప్రయాగ్రాజ్‌లోని షాహి స్నానఘట్టానికి చేరుకుంటారు.
  • ఉదయం 10:10 – మధ్యాహ్నం 12:10 వరకుత్రివేణి సంగమంలో మహా కుంభమేళా పుణ్యస్నానం ఆచరిస్తారు.
  • మధ్యాహ్నం 1:00 గంటకు – ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి ప్రయాణం అవుతారు.
  • మధ్యాహ్నం 2:45 గంటలకు – వారణాసిలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు.
  • సాయంత్రం 3:40 గంటలకు – వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  • సాయంత్రం 4:00 గంటలకువిశాలాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • సాయంత్రం 5:25 గంటలకువారణాసి నుంచి విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు.

కుంభమేళా ప్రత్యేకత

ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహోత్సవంగా భావిస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం ద్వారా పాప విమోచనం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ క్రమంలో నారా లోకేష్ పుణ్యస్నానం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఉపాధి హామీ లబ్ధిదారులకు అలర్ట్.. 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ.

ఆలయ సందర్శనలతో భక్తి మయమైన ప్రయాణం

ఈ మహా యాత్రలో భాగంగా నారా లోకేష్ వారణాసిలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కుంభమేళా, వారణాసి ఆలయ దర్శనాలతో ఆయన ప్రయాణం భక్తి మయంగా సాగనుంది.

ఏపీ ప్రభుత్వ పనితీరుపై బిల్ గేట్స్ ప్రశంసలు.. “గ్రేట్ వర్క్” అంటూ కితాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *