ఆంధ్రప్రదేశ్లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్కు సమన్లు
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (CS)కు సమన్లు జారీ చేసింది.
ఓ సామాజిక కార్యకర్త జనవరిలో ఈ ఘటనపై NHRCకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు, బాధ్యులను వెంటనే విచారించి నివేదిక పంపాలని కమిషన్ CSను కోరింది. అయితే, రిమైండర్లు పంపినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూర్తి సమాచారం మరియు అవసరమైన డాక్యుమెంట్లతో 2025 జనవరి 20వ తేదీలోగా NHRC ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
