మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి వన్నె తేవాలి.
కోదాడ,ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీమతి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబును కోదాడ పట్టణ ప్రముఖులు పలువురు ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా హుజూర్నగర్ మాజీ మండల అధ్యక్షులు సాముల శివారెడ్డి మాట్లాడుతూ అపార రాజకీయ అనుభవం ఉన్న ఎర్నేని మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎంపిక కావడం ఎంతో అభినందనీయం అన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చైర్పర్సన్ పదవికి వన్నె తేవాలన్నారు. ఈ సందర్భంగా కుసుమ వెంకటరత్నం బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో చైర్మన్ పదవి వరించిందన్నారు.వారి సహాయ సహకారాలతో కోదాడ మున్సిపాలిటీ నీ అభివృద్ధి చేస్థామ న్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతారామయ్య, పారి శ్రామిక వేత్త గంట సత్యనారాయణ, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండు రంగా రావు, పోటు రంగారావు, మునిసిపల్ కమిషనర్ రమాదేవి, మునిసిపల్ డీఈ ఉన్నారు.

