విజయవాడ ఫిబ్రవరి 17: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన (పార్వతీ పురం మన్యం జిల్లా) వివాదాస్పద కొఠియా 21 గ్రామాలు,6 పంచాయతీల్లోఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్న నిక్షిప్తమై ఖనిజ సంపదను దోచుకోవడానికి ఒడిశా ప్రభుత్వం సరిహ ద్దు ప్రాంతాల్లో ని గిరిజను లను ఆంధ్రప్రదేశ్ అధికారు లని భయపెట్టి చొరబడింద ని రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని రాష్ట్ర శాసనస భ లో చర్చించి ప్రకటించా లని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా మంగళ వారం విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ లకు రాసిన లేఖ లను విడుదల చేసారు. ఈ మేరకు ఆయన మాట్లా డుతూ 1968 లో రెండు రాష్ట్రాల మధ్య ఈ సరిహ ద్దు గ్రామాల వివాదం తలె త్తిందని 1988 లో సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని 2006 లో స్టేటస్ కో వచ్చిందని ఆర్టికల్ 131 ప్రకారం రాష్ట్రాల హద్దులు కోర్టు చెప్పదు పార్లమెంటు ద్వారా కమిటీ వేసి పరిష్క రించుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందని 58 సంవ త్సరాల నుండి ఈ వివా దం రెండు రాష్ట్రాల మధ్య నలుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరు అధి కారంలో ఉన్నా 21 గ్రామా ల గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందని ఒడిశా ప్రభుత్వం, పోలీసులు బలవంతంగా గిరిజనులు భూములు, సంపద పై పెత్తనం చేస్తు న్నారని ఈ మధ్యనే గంజా యి భద్ర పంచాయితీ పరి ధిలోని దిగువ సెంబి అంగ న్వాడీ కేంద్రంలో ఉన్న తెలుగు బోర్డులు, చార్టు లు, పిల్లల పుస్తకాలు ఒడిశా పోలీసులు తీసుకు పోయారని కొఠియా గ్రూప్ గ్రామాల్లో పనిచేసేందుకు ఆంధ్రా అధికారులు భయ పడుతున్నారని ఆంధ్రా గిరిజన ప్రాంతాల్లో ఒడిశా అధికారులు రోడ్లు, వీది లైట్లు వేశారని, 21 గ్రామా ల, 6 పంచాయతీల గిరిజ నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నివసించాలని కోరుకం టున్నారని ఒడిశా అధికా రులు, పోలీసులు మన 108 ని కూడా గిరిజన ప్రాంతాలకు పోనివ్వడం లేదని, గతంలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి పాలనలో శాంతియుతం గా ఉండేదని ఇప్పుడు ఒడిశారాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రావ డంతో ఒడిశా అధికారుల ను, పోలీసులని అపలేని పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తగిన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఖనిజ సంపదను, గిరిజన కుటుం బాలను కాపాడాలని భీశె ట్టి కోరారు. ఈ కార్యక్రమం లో ఉప్పులూరి రవి తేజా, బి.సతీష్ తదితరులు పాల్గొన్నారు.

