Breaking News

ఆల్ఫండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి.

పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు,ప్రాథమిక పాఠశాలలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ,జూనియర్ కాలేజ్ ,పాలిటెక్నిక్ కళాశాల, మరియు డాక్టర్ అంబేద్కర్ గురుకులం యందు 2900 మంది విద్యార్థిని, విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. అంబేద్కర్ గురుకులం యందు డివిజనల్ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి ద్వారా మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం 6 నెలలకు ఒక్కసారి అందిస్తున్న నులి పురుగుల నివారణ కొరకు అందిస్తున్న ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా వేసుకోవాలి అన్నారు , దీనివలన రక్తహీనత, విరోచనాలు, చర్మవ్యాధులు రాకుండా చేయవచ్చును.మరియు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండటం. చదువులో చురుకుదనం కలిగి ఉంటారని తెలిపారు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మల్లయ్య మాట్లాడుతూ చేతుల శుభ్రత, మరుగుదొడ్లు వాడకం, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు కడిగిన తర్వాతనే వాడాలని ,సురక్షిత మంచినీటిని వాడాలని. పాద రక్షలు ధరించాలని తెలిపారు. కార్య క్రమంలో మండల అభివృద్ధి అధికారి విష్ణుప్రసాద్, డాక్టర్ శ్రావణ్ కుమార్, ప్రిన్సిపాల్ ఉషారాణి , డిప్యూటీ ఎంపీ డి.ఓ, ఆరోగ్య కార్యకర్తలు నాగేశ్వరీ,సుజాత లు ఉపాధ్యాయ సిబ్బంది. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

400 మంది పేద‌ల‌కు రూ.2,500 విలువ గ‌ల రేష‌న్ కిట్స్ పంపిణీ..!

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *