విజయవాడ. ఫిబ్రవరి 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రముఖ పాత్రికేయులు సయ్యద్ అక్బర్ విజయవాడలో పుట్టి శాతవాహన కాలేజీలో చదువుకొని తదుపరి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పాత్రికేయులుగా కెరీర్ ప్రారంభించి డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో గత నాలుగు దశాబ్దాల నుంచి న్యూస్ ప్రతినిధిగా ఎడిటర్ గా కొనసాగి సేవలందిం చి పదవీ విరమణ చేసి ఇప్పుడు తాత్కాలికంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కి ఎడిటర్ గా ఇన్చార్జిగా పనిచేస్తూన్న ఆయన్ను ఫిబ్రవరి 17 వ తేదీన అనగా 17/2/2026న బెజవాడ బార్ అసోసియేషన్కు విచ్చేసి బెజవాడ బార్ అసోసియేషన్ తో ఆయనకి ఉన్న అనుభవాలను అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతను అవశ్యకతను తెలియజేస్తూ భాష మీద పట్టు లేక ఎంతోమ ది ఉద్యోగ అవకాశాలను కోల్పోతూ వెనుకబడిపోతున్నారని ముఖ్యంగా న్యాయవాదులకు సబ్జెక్టు తోపాటు ఇంగ్లీష్ మీద కూడా పట్టు చాలా అవసరం అని ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ న్యాయవాదు లతో ఆయన చదువుకున్న ప్పటి అనుభవాలను పంచుకుంటూ అప్పటి ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు అన్ని అలానే ఉన్నాయని మనలోని నైపుణ్యతను పెంచుకుంటూ అందరూ సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అధ్యక్షులు ఎ కె బాష ఆయనని సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు రాజ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

