సికింద్రాబాద్లో ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన
హైదరాబాద్: డిసెంబర్ 11
సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్, కుమ్మరిగూడలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు అక్టోబర్ 13న రాత్రి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆలయంలో పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై, వేద పండితుల సమక్షంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదేవిధంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. విద్రోహం జరిగినప్పుడు అందరం కలిసి సమర్థంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.
