Breaking News

Restructuring the idol of the godess mutyalamma

ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

హైదరాబాద్: డిసెంబర్ 11
సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్, కుమ్మరిగూడలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు అక్టోబర్ 13న రాత్రి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆలయంలో పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై, వేద పండితుల సమక్షంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదేవిధంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. విద్రోహం జరిగినప్పుడు అందరం కలిసి సమర్థంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు.

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *