రేషన్ బియ్యం అక్రమ రవాణా: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు
ఆంధ్ర ప్రదేశ్: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం సమయంలో జయసుధ పేరిట నాని ఒక గిడ్డంగి నిర్మించి, దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారని సమాచారం. ఇటీవల ఈ గిడ్డంగిని పోలీసులు తనిఖీ చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
