Breaking News

Krejrival Clarity on Op-Congres Alignment

ఆప్‌-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్‌ క్లారిటీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఆప్‌-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్‌ క్లారిటీ

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలపై ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టతనిచ్చారు. ‘‘దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు ఉండదు’’ అని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

కొన్ని వార్తలు ప్రకారం కాంగ్రెస్‌కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరిగినట్లు ప్రచారం జరిగింది. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కూడా 1-2 స్థానాలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. కానీ, ఈ వార్తలను కేజ్రీవాల్‌ ఖండించారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

ఆప్‌ అభ్యర్థుల జాబితా విడుదల
ఈ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే ఆప్‌ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రెండు విడతల్లో 31 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌ స్వతంత్రంగా బరిలో నిలుస్తుందని స్పష్టం చేసింది.

మద్యం కేసు & ముఖ్యమంత్రి పదవిపై క్లారిటీ
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవల జైలుకు వెళ్లి వచ్చారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచే వరకు సీఎం పదవిలో కొనసాగనని అప్పట్లో ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కేజ్రీవాల్‌ రాజీనామా చేసి ఎన్నికల కోసం ఆప్‌ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆప్‌ నేత ఆతిశీ దిల్లీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సీఎం బంగ్లా వివాదం
ఈ ఎన్నికల నేపథ్యంలో ‘‘సీఎం బంగ్లా’’ వివాదం రాజుకుంటోంది. కేజ్రీవాల్‌ రూ. కోట్లు ఖర్చు చేసి ముఖ్యమంత్రి నివాసాన్ని ఇంద్ర భవనాన్ని చేశారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై ఆప్‌ స్పందిస్తూ, ‘‘ప్రజలు విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి అడుగుతుంటే బీజేపీ మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ స్వతంత్రంగా పోటీ చేయనుండటంతో పొత్తులపై అభిప్రాయాలు స్పష్టతకు వచ్చాయి. రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు మరింత ఉత్కంఠ రేపనున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *