అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీటి ద్వారా 4 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.
కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అమరావతి అభివృద్ధికి ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు సమకూర్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేసేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
గ్రామ అభివృద్ధికి సంక్రాంతి టార్గెట్
గ్రామసభల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.
విశాఖలో గూగుల్ పెట్టుబడులు – గేమ్ ఛేంజర్
గూగుల్ సంస్థ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గేమ్ ఛేంజర్గా మారుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధికి కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రం సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి ఈ పెట్టుబడులు కీలకమని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఒక ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు.
