కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: రేకుర్తిలోని వివాదాస్పద భూములను 22A జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో బాధితులు మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను సానుకూలంగా విన్న మంత్రులు, దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. త్వరలోనే ఈ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని బాధితులకు హామీ ఇచ్చారు.
