Breaking News

విజయ్–రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నేటి తెలుగు పత్రిక: దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ హోటల్‌లో నిర్వహించే ఈ వేడుకకు పరిమిత సంఖ్యలో అతిథులు మాత్రమే హాజరవుతున్నారు.

వివాహ వేడుక కోసం మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, అలాగే అంతర్జాతీయ భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగనుంది. వ్యాపార దిగ్గజం అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఉదయ్‌పూర్‌కు చేరుకున్నట్లు తెలిసింది.

రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఉద్యోగ సంఘాల ఆనందం.

ఇదిలా ఉండగా, వధూవరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ వివాహం సందర్భంగా విజయ్–రష్మికలకు ఆశీస్సులు అందజేశారు. సప్తపదితో జీవితాంతం స్నేహం, పరస్పర గౌరవం, ప్రేమతో ముందుకు సాగాలని సూచించారు. వారి దాంపత్య జీవితం ఆనందం, బాధ్యతలతో నిండివుండాలని ఆకాంక్షించారు.

టెన్త్ స్టూడెంట్స్‌కు అలర్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *