Breaking News

విజయ్–రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నేటి తెలుగు పత్రిక: దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ హోటల్‌లో నిర్వహించే ఈ వేడుకకు పరిమిత సంఖ్యలో అతిథులు మాత్రమే హాజరవుతున్నారు.

వివాహ వేడుక కోసం మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, అలాగే అంతర్జాతీయ భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగనుంది. వ్యాపార దిగ్గజం అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఉదయ్‌పూర్‌కు చేరుకున్నట్లు తెలిసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇదిలా ఉండగా, వధూవరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ వివాహం సందర్భంగా విజయ్–రష్మికలకు ఆశీస్సులు అందజేశారు. సప్తపదితో జీవితాంతం స్నేహం, పరస్పర గౌరవం, ప్రేమతో ముందుకు సాగాలని సూచించారు. వారి దాంపత్య జీవితం ఆనందం, బాధ్యతలతో నిండివుండాలని ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *