నేటి తెలుగు పత్రిక: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే యూట్యూబర్ Naa Anveshanaకు మరో షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.గత ఏడాది హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నటి Karate Kalyani పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడింది. అయితే అన్వేష్ విదేశాల్లో ఉండటంతో విచారణకు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.
ఇటీవల అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను Meta Platforms బ్లాక్ చేసింది. అయినప్పటికీ, తనకు ఇంకా ఇతర అకౌంట్లు ఉన్నాయని, ఎవరూ ఏమీ చేయలేరని వీడియోల ద్వారా సవాల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా నిలిపివేయాలంటూ Google, మెటా సంస్థలకు పోలీసులు లేఖలు రాయనున్నట్లు సమాచారం.లుకౌట్ నోటీసుల ప్రకారం, అన్వేష్ భారతదేశానికి చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడిని భారత్కు రప్పించేందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తున్నారు.
