Breaking News

మెగాస్టార్ చిరంజీవి – నయనతార – వెంకటేష్ కలిసి నటించిన సినిమా టీవీలో

విజయవాడ, 25 ఫిబ్రవరి,నేటి తెలుగు పత్రిక: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ హై-ఆక్షన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ థియేట్రికల్ రన్‌లో భారీ వసూళ్లు సాధించి, విస్తృత ప్రశంసలు అందుకుంది. మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28, శనివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు ఫిబ్రవరి 11 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫాం జీ5(ZEE5) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మితా కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి శంకర వరప్రసాద్ పాత్రలో కనిపించగా, నయనతార, వెంకటేష్ దగ్గుబాటి, కెథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.భీమ్స్ సెసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం, తమ్మిరాజు ఎడిటింగ్‌తో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా మారింది. హృదయస్పర్శక కుటుంబ భావాలు, నవ్వులు పూయించే కామెడీ, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆత్మీయ ప్రదర్శనలతో అన్ని వయసుల ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా నిలిచింది. డిజిటల్ వేదికపై కూడా సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం జీ5లో సంచలనాత్మకంగా 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి ప్రేక్షకాదరణను మరింతగా చాటుకుంది. మెగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాని జీ5, జీ తెలుగు వేదికగా మీరూ తప్పకుండా చూసేయండి.

విజయ్–రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

రాజమౌళి–నాగచైతన్య భేటీ.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *