గూడూరు ,అమరావతి పోస్ట్,నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని గూడూరు నియోజకవర్గ పిఓసి కె.మోహన్ సూచించారు. తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త ఆరణీ శ్రీనివాసులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ రావు సూచనలతో బుధవారం గూడూరు పార్టీ కార్యాలయంలో నాయకుల సమావేశం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 26నుంచి ప్రారంభమయ్యే ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. సభ్యత్వ నమోదు పార్టీ భవిష్యత్తుకు కీలకమని, ప్రతి కార్యకర్త ఉద్యమిగా, సాధక్గా, ప్రధాతగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోహన్ పేర్కొన్నారు. జనసైనికులు, వీరమహిళలకు అండగా నిలిచి, వారిని కొత్తతరం నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ శ్రీకారం చేసిన ఈ కార్యక్రమం సభ్యత్వం, ₹5 లక్షల ప్రమాద బీమా తో పాటు నాయకత్వ అవకాశాలు కల్పిస్తుంది. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి నుంచే సభ్యత్వం నమోదు చేయండి.సమావేశంలో వంశీకృష్ణ, భాస్కర్, అక్బర్ కుమార్, నవీన్, గురుబాబు, నాగార్జున, మస్తాన్, సాయి కృష్ణ, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

