కోదాడ, ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ గురైన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గత 100 రోజులుగా అనేక దశల వారీగా నడిపిన ఉద్యమ ఫలితంగా అలాగే రాజ్యాంగబద్ధంగా ఉన్న అనేక వ్యవస్థలను కదిలించిన ఫలితంగా కర్ల లలితమ్మ కి ప్రభుత్వ లభించింది.కోదాడ ఆర్డీవో సూర్య నారాయణ, డిప్యూటీ డెరైక్టర్ దయానందరాణి , తాసిల్దార్ వజిడ్ అలీ ” కర్ల లలితమ్మ ” గ ఎమ్మార్పీఎస్ నాయకుల సమక్షంలో ఉద్యోగ నియామక పత్రం అందజేశారు.
కర్ల లలితమ్మ కి షెడ్యూల్డు కులాల అభివృద్ది శాఖలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా కర్ల లలితమ్మ MRP ” మంద కృష్ణ మాదిగ ” గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఉద్యోగ నియామకం పత్రం అందించిన RDO, SCDD DD, MRO గార్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా.గోవిందు నరేష్ మాదిగ రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి
ఏపూరి రాజు మాదిగ సూర్యాపేట జిల్లా కన్వీనర్,రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, వడ్డేపల్లి కోటేష్ , ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎం ఎస్ ఎఫ్జిల్లా మండల అధ్యక్షులు , పట్టణ నాయకులు పాతకోట్ల నాగరాజు , బచ్చలకూరి ప్రసాద్ , సిద్దెల శ్రీను, లంజపల్లి శ్రీను, పిడమర్తి చిన్న వెంకట్రావు, మల్లెపంగు సూరి, గుడిపాటి కనకయ్య, కొండపల్లి సూర్యప్రకాష్, ఆకారపు కొండలు, పందింటి నవీన్, యలమర్తి ఉపేందర్, కర్ల శివ , కర్ల ప్రేమ్ , కర్ల కమల్, దాసరి రవి, కందుకూరి ఉపేందర్, రోహిత్ , అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
