Breaking News

పారిశుద్ధ్యం లో కోదాడ పట్టణాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం

పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలీ.

వార్డు వార్డు కు దోమల మందు పిచికారి: మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు ఎర్నేని

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు.

కోదాడ, ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణ పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు.శుక్రవారం కోదాడ మునిసిపల్ పరిధి లోని ఆరో వార్డు గోపిరెడ్డి నగర్ లో కౌన్సిలర్ తుమ్మల నాగేంద్రమ్మ తో కలిసి దోమల మందు పిచికారీలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పారిశుద్ధ్యం లో కోదాడ పట్టణాన్ని జిల్లా లో అగ్ర స్థానం లో నిలుపుతాం అన్నారు.పరిసరాల శుభ్రత తోనే ఆరోగ్యం కలుగుతుందన్నారు. వార్డు వార్డు కు దోమల నివారణ మందు పిచికారి చేపట్టినట్లు తెలిపారు.మునిసిపల్ సిబ్బంది పారి శుద్ధ్య కార్య క్రమాలపై నిర్లక్ష్యం వహించ వద్దన్నారు.కౌన్సిలర్ ల సూచనల మేరకు వార్డు ల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సత్వర సేవలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో రావిళ్ళ కృష్ణారావు, దేవ మణి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

ఫిబ్రవరి 28న భావ రస నాట్యోత్సవం – సీజన్ 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *