యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 27 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): కొలనుపాక నుండి బైరాన్ నగరం వెళ్లే దారిలో గల పెద్ద వాగు పై వంతెన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ ఖర్చులకు గాను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి తన వంతు సహాయంగా 50 వేల రూపాయలు నంద మహేందర్ గారికి సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ మరియు మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొలనుపాక బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జంగ స్వామి మరియు పిఏ సిఎస్ డైరెక్టర్ ఆరె మల్లేష్, బిఆర్ఎస్ కొలనుపాక వార్డ్ మెంబర్ బల్లెపు సంపత్ కుమార్ , సీనియర్ నాయకులుసురేందర్ రెడ్డి , బెదరబోయిన శంకర్ , బొంకూరి రాములు, గంధ మల్ల రవి , ఏదునూరి భాస్కర్ మరియు బైరం నగరం వాసులు , నంద మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
