Breaking News

Panchayat's election readiness

పంచాయతీ ఎన్నికల సంసిద్ధత

పంచాయతీ ఎన్నికల సంసిద్ధత: వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం

జిల్లాలో 335 పంచాయతీలు, 2874 వార్డులు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 11 : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం ఆశావాహులు ఎదురుచూస్తుండగా, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు

జిల్లాలో మొత్తం 335 గ్రామపంచాయతీలు, 2874 వార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 2908గా అధికారులు గుర్తించారు. పోలింగ్‌ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

గ్రామపంచాయతీ పాలనలో మార్పులు

గతంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జనవరి 30తో ముగిసింది. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలన మొదలై, ఇప్పటివరకు పదినెలలు పూర్తి అయ్యింది. జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జిల్లాలో ఓటర్లు

జిల్లాలో మొత్తం 3,51,194 మంది ఓటర్లను గుర్తించారు. వీరిలో 1,75,571 మంది పురుషులు, 1,75,605 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు.

ఎదురుచూస్తున్న ఆశావాహులు

నోటిఫికేషన్ కోసం రాజకీయ ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్య పార్టీలకు చెందిన నాయకులు, సర్పంచ్ పదవులపై పోటీ చేయాలనుకునే వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఏకగ్రీవ పంచాయతీలు అధికంగా ఉండగా, ఈసారి పోటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

నిబంధనల మార్పుల ప్రభావం

గతంలో “రెండు కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు” అనర్హులుగా గుర్తించగా, ఈ సారి ఆ నిబంధన ఎత్తివేయడంతో మరింత మంది ఆశావాహులు బరిలో నిలుస్తారని అంచనా. ఈ నేపథ్యంలో పంచాయతీ పోరు ఉత్కంఠగా మారింది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కోసం జిల్లా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *