Breaking News

Allocation of Reternable Plots to Amaravati Farmers

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు: సీఆర్డీఏ చర్యలు

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇవాళ లాటరీ ద్వారా ప్లాట్లను అప్పగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

2014-19 మధ్య కాలంలో అమరావతి ప్రాజెక్ట్ కోసం 14 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించారు. దీనికి బదులుగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అందిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

ఈ కేటాయింపు ప్రక్రియ కింద నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ఈ లాటరీ నిర్వహించనున్నారు. కేటాయింపుల ప్రక్రియ సజావుగా సాగేందుకు సీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

14 గ్రామాల రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని సీఆర్డీఏ అధికారులు విజ్ఞప్తి చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *