Breaking News

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సేవలందించిన విద్యావేత్తకు నివాళులు.

28 ఫిబ్రవరి 2026, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి ప్రొఫెసర్ సి. సౌందరరాజన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా విద్యారంగానికి విశేష సేవలు అందించారని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని బలోపేతం చేయడంలో ప్రొఫెసర్ సౌందర్యరాజన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడిన ఆయన, “వీసా బాలాజీ”గా చిలుకూరు దేవస్థానానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని అన్నారు.ప్రొఫెసర్ సౌందర్యరాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ఎంపీ రవిచంద్ర తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *