Breaking News

శ్రీకృష్ణదేవరాయుల జయంతి–వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి: జాతీయ కాపు సంఘం వినతి

నగరి, ఫిబ్రవరి 28 (శనివారం)నేటి తెలుగు పత్రిక: నగరి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కి బలిజ కులస్తులు వినతిపత్రం సమర్పించారు. జాతీయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.జాతీయ కాపు సంఘం జాతీయ ప్రచార కార్యదర్శి పి. గోపి రాయల్, నగరి నియోజకవర్గ అధ్యక్షుడు ఎం.వి. బాబు రాయల్ నేతృత్వంలో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన ప్రతినిధులు, శ్రీకృష్ణదేవరాయలు జయంతి, వర్ధంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణదేవరాయుల సేవలు, తెలుగు సాహిత్యానికి చేసిన కృషి, సామాజిక సమగ్రతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తే యువతకు చరిత్రపై అవగాహన పెరుగుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *