Breaking News

దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు.

ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాయమైన బ్రాస్లెట్ భక్తులు కి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్ కు దుర్గగుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక అభినందనలతో పాటు పట్టుచీర, నగదు అందజేశారు.గురువారం విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా క్యూ లైన్ లో బ్రాస్లైట్ క్రింద పడిపోవడంతో సంబంధిత బ్రాస్లైట్ ను వెంటనే గుర్తించి ఆ బ్రాస్లైట్ తిరిగి బాధిత భక్తులకు సెక్యూరిటీ గార్డ్ అందజేయడం జరిగింది. టెంపుల్ ఇన్స్పెక్టర్ డివిఎన్ రాజు ( మంగళగిరి రాజు ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది నేతృత్వంలో తిరిగి వారికి బాధిత భక్తులకు అందజేశారు.ఈ సంఘటన గురించి తెలుసుకున్న దుర్గ గుడి ఈవో శీనా నాయక్ సంబంధిత మహిళా సెక్యూరిటీ గార్డును అభినందించి శనివారం ఆమెకు పట్టుచీరతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.దేవస్థానంలో అంకితభావంతో విధులు నిర్వహించే వారిని పారదర్శకంగా వ్యవహరించే వారిని అభినందించే తీరు ఉద్యోగుల్లో మరింత బాధ్యత పెంపొందించే విధంగా ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వేగవంతానికి ఆదేశాలు

జనగణన నమోదు తోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలకు జనగణన సర్వే ఎంతో కీలకం : పామర్రు ఎంపీడీవో కాండ్రు జ్యోతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *