నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో నకిలీ సరుకుల దందా మళ్లీ బహిర్గతమైంది. బ్రాండెడ్ పేర్లతో చీప్ మెటీరియల్ను ప్యాక్ చేసి మార్కెట్లోకి వదులుతున్న గ్యాంగ్ను సీసీఎస్ స్పెషల్ టీం బయటపెట్టింది. బేగంబజార్లోని పలు గోదాములు, షాపులపై దాడులు నిర్వహించి భారీగా నకిలీ కిరాణా సరుకులు స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన సరుకులు:
- 1340 నకిలీ రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు
- 100 నకిలీ తాజ్ మహల్ టీ ప్యాకెట్లు
- 75 కిలోల లూజ్ టీ పౌడర్
- 1900 నకిలీ సర్ఫ్ ప్యాకెట్లు
- 3600 నకిలీ గుడ్నైట్ లిక్విడ్ బాటిల్స్
- 9500 నకిలీ లేబుల్ కవర్లు
ఎలా మోసం?
నిందితులు గుజరాత్ డీలర్ల నుంచి తక్కువ నాణ్యత గల మెటీరియల్ తెప్పించి, నకిలీ బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేసి గోషామహల్, అఫ్జల్గంజ్, బేగంబజార్ ప్రాంతాల్లో హోల్సేల్గా విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ముగ్గురు అరెస్ట్
రాజస్థాన్కు చెందిన జయరామ్, కచ్చవా సురేందర్, హనుమాన్ రామ్లను అరెస్ట్ చేసి గోషామహల్, అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు.
వినియోగదారులకు హెచ్చరిక
కల్తీ దందా పెరుగుతున్న నేపథ్యంలో సరుకులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
