Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉచిత ప్రయాణంపై కీలక అప్డేట్.. మహిళలకు మరిన్ని బస్సులు!

నేటి తెలుగు పత్రిక: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మరో కీలక అప్డేట్ వెలువడింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం కారణంగా మహిళల ప్రయాణం గణనీయంగా పెరిగింది.

92% దాటిన ఆక్యుపెన్సీ

పథకం ప్రారంభం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ 92 శాతానికి పైగా నమోదవుతోంది. రోజుకు సగటున 26 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని బస్సులు రాబోతున్నాయి

రద్దీ పెరిగిన నేపథ్యంలో అదనంగా కొత్త బస్సులు తీసుకురావాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త బస్సులు రాకతో మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

సొంత నిధులతో ఎకరం పొలాన్ని ఎస్సీ కుల స్మశానానికి కేటాయించిన పొన్నం బాలాజీ

ఆర్టీసీకి కూడా లాభమే

ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ రూపంలో ఇప్పటివరకు రూ.1,714 కోట్లు అందాయి. దీంతో ఆర్థికంగా ఆర్టీసీకి ఊరటనిచ్చింది.

పురుష ప్రయాణికులు తగ్గుదల

మహిళల సంఖ్య పెరిగినప్పటికీ, పురుష ప్రయాణికుల శాతం 37%కి పడిపోయినట్లు సమాచారం.

అక్రమాలపై చర్యలు

కొంతమంది కండక్టర్లు ఇన్సెంటివ్ కోసం ప్రయాణికులు లేకపోయినా ఉచిత టికెట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు దృష్టిసారించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉపాధి కూలీలకు ప్రత్యేక ఐడీ.. డూప్లికేట్ హాజరుకు చెక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *