Breaking News

యుఎన్ఓ జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలి.. తేజ పాఠశాల చిన్నారుల నిరసన ర్యాలీ

కోదాడ ,మార్చ్ 4(నేటి తెలుగు పత్రిక.): ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబులదాడిలో 165 మంది చిన్నారుల దుర్మారణానికి నిరసనగా కోదాడ పట్టణంలోని తేజా టాలెంట్ పాఠశాల విద్యార్థులు బుధవారం ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు.. యుఎన్ఓ జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య మాట్లాడుతూ యుద్ధాలతో దేశాలకు నష్టం వాటిల్లుతుందన్నారు.. ప్రపంచ శాంతి కోసం దోహదపడాల్సిన అమెరికా యుద్ధాన్ని ప్రేరేపిస్తుందన్నారు.. యుద్ధంలో చిన్నారుల జీవితాలు చిదిమి వేయబడిన దుర్ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తుందన్నారు.. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా యు.ఎన్.ఓ జోక్యం చేసుకొని యుద్ధం నిలువరించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. ఈ నిరసన ర్యాలీలో పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ ప్రిన్సిపల్ సోమా నాయక్ ఇన్చార్జి రామ్మూర్తి నవ్య రేణుక ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *