కోదాడ ,మార్చి 4(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, రామాపురం కు చెందిన ఆరే మల్లయ్య మృతి కుటుంబానికి తీరని లోటు అని, ఆయన ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బిజెపి సీనియర్ నాయకులు , సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ అన్నారు. రామాపురంలో ఆరే మల్లయ్య పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొని మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు ,సీనియర్ జర్నలిస్ట్ మడూరి వెంకటేశ్వరరావు, తీపిరి శెట్టి. బసవయ్య , ఆరే వెంకటేశ్వర్లు (బాబు).
