- లక్షల మంది ప్రజలు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు.
యాదగిరిగుట్ట : మార్చి 04 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి మరియు బీసీ కాలనీలో ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్ల బాధితులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ కౌన్సిల్ నెంబర్ రచ్చ శ్రీనివాస్ మరియు పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల కడుపు కొట్టడానికే ఈ రాష్ట్రంలో అధికారులకు వచ్చింది. ఎందుకంటే పట్టణంలో ఇందిరా కాలనీ , బీసీ కాలనీ ఈ యాదగిరిపాల్లో ఈ మూడు ప్రాంతాల్లో సుమారు 762 ఇండ్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది దీనివలన ఆ యొక్క ఇల్లును అమ్మడం గాని ,కొనడం గాని ,లోన్ తీసుకోవడం గాని జరగదు దీనివలన ఆపద కష్టం వచ్చినా కూడా ఆ యొక్క ఇల్లు ని యజమాని అమ్మడానికి వీలు లేదు ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం అయినటువంటి చర్య దీని ద్వారా సుమారు 762 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఆ కట్టిన ఇల్లు కూడా విలువ లేకుండా పోతుంది మున్సిపల్ టాక్స్ ను ముక్కు పిండి వసూలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు పేదల భూములను ఇండ్లను లాక్కోడానికే ఈ ప్రభుత్వం ఏర్పడిందా అని ప్రశ్నించారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ లేక కొన్ని లక్షల మంది ప్రజలు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఇలాంటి చర్యల ద్వారా బతికి ఉండగానే ప్రాణం తీసేటట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కావున తక్షణం స్థానిక ఎమ్మెల్యే గారు మరియు అధికారి యంత్రాంగం వీటన్నిటిని రెగ్యులర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. లేనిపక్షంలో ఈ యొక్క అందరు బాధితులతోటి భారీ నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
