Breaking News

‘తల్లికి వందనం’పై మంత్రి లోకేష్ క్లారిటీ.. అర్హులందరికీ సాయం అందిస్తాం

అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు మొత్తం రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు వెల్లడించారు.

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (యూడైస్) ప్రకారం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 79,51,903 మంది విద్యార్థులు నమోదై ఉన్నారని తెలిపారు. వీరిలో అర్హత ఉన్న వారిలో సుమారు 84 శాతం మందికి తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించామని మంత్రి పేర్కొన్నారు.అర్హత ఉన్నప్పటికీ సాయం అందని వారు ఉంటే వారి వివరాలు ఇవ్వాలని లోకేష్ కోరారు. అటువంటి సమస్యలను పరిశీలించి అర్హులందరికీ సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *