Breaking News

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం.. ప్రజాప్రతినిధులకు స్వదేశీ హెల్త్ కిట్లు

అమరావతి, మార్చి 06, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వదేశీ ఉత్పత్తులతో తయారైన ప్రత్యేక మెడికల్ కిట్లను అందజేశారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న “Vocal for Local” మరియు స్వదేశీ భావజాలాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ మెడికల్ కిట్లను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానికంగా తయారైన ఆరోగ్యకరమైన వస్తువులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

ఈ ప్రత్యేక కిట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఆయుర్వేద మందులు, సహజసిద్ధమైన సిరిధాన్యాలు (మిల్లెట్స్) మరియు 9 రకాల చాక్లెట్లు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్వాహకులు సూచించారు. స్థానిక ఉత్పత్తులను ఆదరిస్తూ స్వదేశీ విధానంతో దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *