- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయులు బీర్ల ఐలన్న.
యాదగిరిగుట్ట, మార్చి 06,( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయులు బీర్ల ఐలన్న యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని వీధులు రోడ్లు ప్రతి ఒక్కటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలు నాయకులు అధికారులతో కలిసి ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రమాణం చేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్య మహేందర్ రెడ్డి , యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ , మున్సిపల్ ఆఫీసర్స్ , మున్సిపల్ కౌన్సిలర్ మరియు యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం యాదగిరిగుట్ట లోని బుడగ జంగాల కాలనీలో రోడ్లు క్లీన్ చేస్తూ పారిశుద్ధంగా ఉంచాలని ప్రజలకు తెలియజేశారు. అనంతరం కార్మికులతో ముచ్చటించారు.
