నేటి తెలుగు పత్రిక,mar 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్.మహిళా సాధికారతే దేశ ప్రగతికి మూలస్తంభమని ఆయన పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘నారీ శక్తి’ సంకల్పం మహిళలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా మార్గదర్శిగా నిలుస్తోందని అన్నారు.ప్రతి మహిళ స్వాభిమానం, స్వావలంబనతో సమాజంలో ముందుకు సాగాలని పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. మహిళలు తమ ప్రతిభతో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.రాబోయే తరాలకు స్త్రీ శక్తి ప్రేరణగా నిలవాలని, మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాభినందనలు తెలిపారు.
