సూర్యాపేట టౌన్,మార్చి 8, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా బిజెపి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రామిక మహిళలను శాలవాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని రోజు రోజుకు మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు పరచడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని వాపోయారు. షీ టీం బృందాలు సంఖ్యను పెంచాలని పాఠశాల, కళాశాల బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ప్రధాన కూడళ్లల్లో మహిళలను, బాలికలను వేధిస్తున్న ఆకతాయిలను గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోగుల సురేష్, చిత్రం భద్రమ్మ, ధనమ్మ, మంగమ్మ, త్రివేణి, లక్ష్మి, జ్యోతి, పద్మతదితరులు పాల్గొన్నారు.
