మంగళగిరి,mar 09,నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నారా లోకేష్ నెరవేర్చారు. భవిష్యత్లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ రిటైనింగ్ వాల్ను ఆధునిక డిజైన్తో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మంగళగిరి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వరద ముప్పు తగ్గనుంది.ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా దాదాపు 50 వేల మంది ప్రజలు వరద భయంలేకుండా సురక్షితంగా జీవించగలరని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
