Mar 09, నేటి తెలుగు పత్రిక: ఇంద్రకీలాద్రిపై భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై సీపీ పరిశీలన భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ మరియు పార్కింగ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కొండపై ఉన్న ప్రధాన ఆలయం, పరిసర ప్రాంతాలు, ఘాట్ రోడ్డుతో పాటు పలు కీలక ప్రదేశాలను ఆయన సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్కు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా అదనపు డీసీపీలు, ఏసీపీలు, వన్టౌన్ సీఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.పరిశీలన అనంతరం సీపీ రాజశేఖర్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.





