ముంబయి,mar 10, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో నిర్వహించిన IAAPI Expo 2026లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, Andhra Pradesh Tourism Policy 2024–29 ద్వారా పెట్టుబడిదారులకు పలు రాయితీలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అమ్యూజ్మెంట్ పార్కులు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటు కోసం రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
సుదీర్ఘ తీరప్రాంతం, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. విమానాశ్రయాల విస్తరణ, మెరుగైన రవాణా సౌకర్యాలు, పెరుగుతున్న పట్టణీకరణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా మార్చాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దార్శనికతతో ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’ను రూపొందించామని మంత్రి తెలిపారు. హోటళ్లు, రిసార్టులు, థీమ్ పార్కుల కోసం భూ కేటాయింపు ప్రక్రియను సరళతరం చేసి దేశంలోనే ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
రూ.50 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే వారికి State Investment Promotion Board ద్వారా భూ కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. గత ఏడాది కాలంలోనే 102 ఒప్పందాల ద్వారా రూ.18,448 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు.
అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో భారీ అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అమరావతి గ్రీన్ఫీల్డ్ రాజధానిగా గొప్ప అవకాశాలను కల్పిస్తుందని, విశాఖపట్నం ప్రీమియర్ కోస్టల్ టూరిజం హబ్గా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తిరుపతి భారీగా వచ్చే భక్తుల కారణంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు అనువైన ప్రాంతమని తెలిపారు.దేశంలో అమ్యూజ్మెంట్ రంగం ఏటా సుమారు 15 శాతం వృద్ధి చెందుతోందని, 2030 నాటికి ఇది రూ.25,000 కోట్ల మార్కెట్గా మారే అవకాశముందని మంత్రి దుర్గేష్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 300 అమ్యూజ్మెంట్ పార్కులు, 2,500 ఇండోర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్లు ఉన్నాయని వివరించారుఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం కొత్త దశలోకి అడుగుపెడుతోందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి దుర్గేష్ ముంబయి వేదికగా ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.



