అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రిఎన్.చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై పలువురు మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఎల్పీజీ సరఫరాపై వస్తున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు, మంత్రులకు సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రాష్ట్రానికి సరిపడా ఎల్పీజీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేకుండా సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. గ్యాస్ పంపిణీ వ్యవస్థను దగ్గరగా మానిటర్ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
