Breaking News

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడి.. మహిళలు పనిచేయడానికి మొదటి ఎంపిక ఆంధ్ర ప్రదేశ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశ మహిళలు ఉద్యోగాల కోసం ఎక్కువగా మొగ్గు చూపుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడించింది. మహిళలకు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు, వృద్ధి చెందుతున్న పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని ముందంజలో నిలిపినట్లు రిపోర్ట్ పేర్కొంది.ఈ జాబితాలో రెండో స్థానంలో కేరళ, మూడో స్థానంలో ఢిల్లీ, నాలుగో స్థానంలో తమిళనాడు ఉన్నాయి.మహిళలు ప్రధానంగా హ్యూమన్ రిసోర్సెస్ (HR), బయోటెక్నాలజీ/పరిశోధన, బ్యాంకింగ్-ఇన్సూరెన్స్, బ్యూటీ కేర్ వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాష్ట్రాల వైపు మహిళలు ఆకర్షితులవుతున్నారని నిపుణులు పేర్కొన్నారు.అదేవిధంగా మహిళలకు సురక్షిత వాతావరణం, ఉద్యోగ అవకాశాల పెరుగుదల, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయని రిపోర్ట్ వెల్లడించింది.

సూరంపల్లిలో రైతుతో ముఖాముఖి.. పంటల పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు

ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం నిబంధన’ సడలింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *