మార్చి 14(నేటి తెలుగు పత్రిక): బాల్గొండ నియోజకవర్గం శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేయాలని, ఆయన ప్రజా జీవితంలో ఇంకా విజయాలు సాధించాలని అభిలషించారు.
