మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మెగా అభిమానులకు గుడ్ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈసారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని ఎ. ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. దీంతో సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బర్త్డే రోజున ప్రత్యేక సర్ప్రైజ్
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అభిమానులకు ఇది పెద్ద పండగే అవుతుంది.
మరో క్రేజీ అప్డేట్
ఇక రంగస్థలం తర్వాత మరోసారి సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం RC17 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చరణ్ బర్త్డే రోజున ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లేదా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీంతో ఈసారి రామ్ చరణ్ బర్త్డే మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనుందనే టాక్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
