Breaking News

Notices to collectors of four districts

నాలుగు జిల్లాల కలెక్టర్లకు నోటీసులు

రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్, డిసెంబర్ 13:
రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజా ప్రాయోజిత వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో బాధిత రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో జాప్యం తలెత్తినందుకు యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, అదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

కొండల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. రైతుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకుని, బాధితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆయన వాదించారు. నాలుగు నెలల్లో పరిహారం అందిస్తామని చెప్పి, ఇప్పటికీ ఏడాది గడిచినా పరిహారం అందకపోవడం బాధాకరమని పిల్‌లో పేర్కొన్నారు.

ఈ మేరకు హైకోర్టు ప్రభుత్వ నిర్లక్ష్యంపై సీరియస్‌గా స్పందించింది. “కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు స్వీకరించకూడదో చెప్పాలి” అని నోటీసుల్లో స్పష్టంగా సూచించింది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లు తమ సమాధానాలను త్వరగా అందజేయాలని స్పష్టం చేసింది. రైతుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *