Breaking News

Violation of election code: Case against former CM Jagan..?

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 10కి వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 13, 2024:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 10కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

తెలుగుజాతి గౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ: నారా లోకేష్

సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, సీబీఐ, ఈడీ స్టేటస్ రిపోర్టులు నిన్న సాయంత్రం ఫైల్ చేసినట్లు వెల్లడించారు. ధర్మాసనం ఆ రిపోర్టులను పరిశీలించేందుకు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం, రిపోర్టుల పరిశీలన అనంతరం మరిన్ని వివరాలతో జనవరి 10న విచారణ చేపడతామని తెలిపింది.

తిరుపతిలో విషాదం.. వీడియో తీస్తూ 5వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక

ఇక, జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ, ఈడీ దర్యాప్తు పురోగతిని ఈ విచారణలో పునఃపరిశీలించనున్నారు. అసలు కేసుల బదిలీ, బెయిల్ రద్దు వంటి అంశాలపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *