మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలను వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.ఈసారి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న తేదీలు
- పశ్చిమ బెంగాల్ – మే 7
- తమిళనాడు – మే 10
- అస్సాం – మే 20
- కేరళ – మే 23
- పుదుచ్చేరి – జూన్ 15
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇక ఎన్నికల ప్రకటనకు ముందే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ వరుస పర్యటనలతో ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటికే Assamలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తూ అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకువెళుతున్నారు.అలాగే త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ సభలు నిర్వహించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలం పెంచేందుకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది.
