మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రాల వారీగా పోలింగ్ తేదీలు
- Assam – ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్
- Puducherry – ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్
- Kerala – ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్
- Tamil Nadu – ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న కౌంటింగ్
- West Bengal – ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్, మే 4న కౌంటింగ్
ఉపఎన్నికలు కూడా
ఈ ఎన్నికలతో పాటు దేశంలోని 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
భారీ ఎన్నికల ఏర్పాట్లు
- దేశవ్యాప్తంగా 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- ఎన్నికల విధుల్లో సుమారు 25 లక్షల సిబ్బంది పాల్గొననున్నారు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి.
