యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తుర్కపల్లి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముస్లిం సోదరులకు రమజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సౌభ్రాతృత్వం, సేవా భావానికి ప్రతీక అని తెలిపారు. పేద కుటుంబాలకు ఉపవాస దినాల్లో ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మరియు నాయకులు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు . ప్రతి వర్గం ప్రజలు సంతోషంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఉపవాసాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు…
