మార్చి 16(నేటి తెలుగు పత్రిక): దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) సరఫరా కొనసాగుతుందని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో కూడా తగినంత LPG నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.ఇరాన్ సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న భారత నౌకలన్నీ సురక్షితంగానే ఉన్నాయని కేంద్రం పేర్కొంది. శివాలిక్ LPG ట్యాంకర్ నౌక ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత తీరానికి చేరుకోనుందని తెలిపింది. ఈ నౌకలో సుమారు 48 వేల మెట్రిక్ టన్నుల LPG గ్యాస్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో వంటగ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
